మహీంద్రా తన ప్రముఖ ఎస్‌యూవీ స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రారంభ ధర రూ.13.69 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించింది. టాప్ వేరియంట్ ధర రూ.25.49 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా ఉంది. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఈ మోడల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

డిజైన్ పరంగా పెద్దగా మార్పులు చేయలేదు. పాత మోడల్‌లో ఉన్న దృఢమైన డిజైన్‌ను కొనసాగించింది. అయితే కొత్త డ్యూయల్ టోన్ 18 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను అందించింది.

ఇంటీరియర్‌లో కీలక అప్‌గ్రేడ్‌లు చేసింది. 12.29 అంగుళాల ఫ్రీ-ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 10.24 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించింది. తొలిసారిగా పనోరమిక్ సన్‌రూఫ్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఫీచర్లలో 540 డిగ్రీ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్, 12 స్పీకర్ల సోనీ ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 6-వే పవర్డ్ డ్రైవర్ సీట్, టైప్-సీ ఛార్జర్ వంటి సదుపాయాలు ఉన్నాయి. అడ్వెంచర్ గణాంకాలను చూపించే ప్రత్యేక డిస్‌ప్లేను కూడా జోడించింది. 

భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, లెవల్-2 అడాస్ వంటి ఫీచర్లు ఇచ్చింది.

ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజిన్‌లతో పాటు 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లను కొనసాగించనుంది. రియర్ వీల్ డ్రైవ్, ఫోర్ వీల్ డ్రైవ్ వేరియంట్లు కూడా అందుబాటులో ఉంటాయి.