స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ తేదీని సంస్థ ప్రకటించింది. ఈ సేల్ ఆగస్టు 8 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ సభ్యులకు ఆగస్టు 7 నుంచే అందుబాటులోకి రానుంది. సేల్ ఎన్ని రోజుల పాటు కొనసాగుతుందనే విషయాన్ని సంస్థ ఇంకా వెల్లడించలేదు.

ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, టీవీలు, గృహోపకరణాలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ తగ్గింపులు ఇవ్వనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఐఫోన్ 17, శాంసంగ్ గెలాక్సీ ఎస్25, మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్, శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ11+ వంటి ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్లు ఉండనున్నాయి. అలాగే శాంసంగ్ 55 అంగుళాల 4కే టీవీ, శాంసంగ్ గెలాక్సీ బుక్ 4పై కూడా తగ్గింపులు అందించనున్నారు.

అర్హత కలిగిన ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి 10 శాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్ ఈఎంఐ లావాదేవీలకూ వర్తిస్తుంది. ఎంపిక చేసిన ఉత్పత్తులపై ఎక్స్ఛేంజ్‌ ఆఫర్లు, ఈఎంఐ సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి. కొన్ని బోట్ ఇయర్‌ఫోన్లు మూడు అంకెల ప్రారంభ ధరలో లభించనున్నట్లు సంస్థ సంకేతాలు ఇచ్చింది.

ఈ సేల్‌లో ఇండియాస్ టాప్ డీల్స్, డీల్స్ ఆఫ్ ది డే, ప్రైస్ క్రాష్, రష్ అవర్స్, టిక్ టాక్ డీల్స్, మేడిన్‌ ఇండియా ఆఫర్ల వంటి ప్రత్యేక విభాగాలు ఉండనున్నాయి. ఏ ఉత్పత్తిపై ఎంత తగ్గింపు ఉంటుందనే పూర్తి వివరాలను సేల్ ప్రారంభానికి ముందు ఫ్లిప్‌కార్ట్ వెల్లడించనుంది.