తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ అదృశ్యం కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కీలక ముందడుగు వేశారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న ఈ కేసులోని ప్రధాన నిందితుడు (A-1) సీఐ నాగరాజును పోలీసులు ఈరోజు విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు.

 

జైలు అధికారుల నుంచి నాగరాజును కస్టడీకి తీసుకున్న పోలీసులు నేరుగా న్యాయస్థానానికి తీసుకొచ్చారు. అయితే రెగ్యులర్ న్యాయమూర్తి సెలవులో ఉండటంతో, సీబీసీఐడీ అధికారులు నిందితుడిని ఇన్‌ఛార్జి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయస్థానం ప్రక్రియ పూర్తయిన వెంటనే నాగరాజును తమ కస్టడీకి తీసుకుని, సాయి కృష్ణ అదృశ్యం వెనుక ఉన్న అసలు నిజాలు, ఇతర వివరాలను రాబట్టేందుకు విచారించనున్నారు.