ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాలో యువత తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. జీవన వ్యయం పెరిగిపోవడం, ఉద్యోగ భద్రత లేకపోవడం, జీతాలు పెరగకపోవడంతో వారు వింత మార్గాలను అనుసరిస్తున్నారు. ఖర్చులు తగ్గించుకునేందుకు అద్దెకు ఉంటున్న తమ మంచాన్ని కూడా అపరిచితులతో పంచుకుంటున్నారు. "బెడ్ షేరింగ్"గా పిలుస్తున్న ఈ కొత్త ట్రెండ్, దేశంలోని యువత ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిళ్లకు అద్దం పడుతోంది.
వుహాన్ నగరానికి చెందిన 25 ఏళ్ల విన్నీ జెంగ్ అనే సేల్స్ ఏజెంట్ ఈ విధానాన్ని పాటిస్తోంది. ఉద్యోగం ఎప్పుడు పోతుందోనన్న భయం, నిలిచిపోయిన జీతంతో ఆమె విసిగిపోయింది. దీంతో తన అద్దె గదిలోని మంచాన్ని మరో మహిళతో పంచుకోవాలని నిర్ణయించుకుంది. దీనివల్ల ఆమెకు నెలకు 450 యువాన్ల (సుమారు 66 డాలర్లు) ఆదా అవుతోంది. "ఇది బతుకుదెరువు కోసం చేస్తున్న పోరాటం. డబ్బు లేనప్పుడు, పని మానేస్తే ఎదురయ్యే ప్రమాదాలను తట్టుకునే శక్తి చాలా బలహీనంగా ఉంటుంది" అని విన్నీ తన పరిస్థితిని వివరించింది.
ఈ 'బెడ్ షేరింగ్' వ్యవహారం సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చకు దారితీసింది. చైనాకు చెందిన వీబో, డౌయిన్ వంటి ప్లాట్ఫామ్లలో దీనికి సంబంధించిన హ్యాష్ట్యాగ్లు లక్షల వ్యూస్ సాధించాయి. జియాహోంగ్షు అనే యాప్లో "బెడ్-షేరింగ్" కోసం వెతికితే వేలకొద్దీ పోస్టులు కనిపిస్తున్నాయి. అపరిచితులతో ఒకే గదిని, కొన్నిసార్లు ఒకే మంచాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నవారి కోసం వెతుకుతున్నట్లు ఈ పోస్టులు వెల్లడిస్తున్నాయి.
ఈ పరిణామంపై రట్జర్స్ యూనివర్సిటీ నిపుణుడు మింగ్వే లియూ మాట్లాడుతూ.. "చాలా మంది యువతలో స్థిరమైన ఉపాధి, స్పష్టమైన ఆదాయ అంచనాలు లేకపోవడం, పట్టణాల్లో తాము నిలదొక్కుకోగలమన్న భరోసా కొరవడటం వంటి వాస్తవ పరిస్థితులకు ఇది ప్రతిబింబం" అని విశ్లేషించారు.
బీజింగ్కు చెందిన 39 ఏళ్ల మోర్గాన్ పాన్ కథ కూడా ఇందుకు భిన్నంగా లేదు. గతంలో ఓ ఏఐ స్టార్టప్లో అధిక జీతం పొందిన ఆయన, ఆ కంపెనీ దివాలా తీయడంతో ఇప్పుడు ఆర్థికంగా చితికిపోయాడు. అద్దె, ఇతర ఖర్చులు తగ్గించుకునేందుకు ఇటీవల తన గదిని, మంచాన్ని మరొకరితో పంచుకోవడం ప్రారంభించాడు. "జీవితంలో ఒత్తిడి తప్ప ఇందులో గొప్పదనం ఏమీ లేదు" అని ఆయన వాపోయాడు.
మరోవైపు విన్నీ జెంగ్, ఖరీదైన బట్టలు కొనడం మానేసి, ఇంట్లోనే వండుకుంటూ పొదుపుగా జీవిస్తోంది. భవిష్యత్తులో జీతం పెరిగినా ఈ విధానాన్ని కొనసాగించవచ్చని ఆమె అంటోంది. "జీతాలు తక్కువ, జీవన వ్యయం ఎక్కువ. అందుకే ఏదో ఒక విషయంలో రాజీపడక తప్పదు. సమాజం ఈ స్థాయికి దిగజారిపోయిందని ఎవరైనా అంటే, అది కఠిన వాస్తవం" అని ఆమె పేర్కొంది.
వుహాన్ నగరానికి చెందిన 25 ఏళ్ల విన్నీ జెంగ్ అనే సేల్స్ ఏజెంట్ ఈ విధానాన్ని పాటిస్తోంది. ఉద్యోగం ఎప్పుడు పోతుందోనన్న భయం, నిలిచిపోయిన జీతంతో ఆమె విసిగిపోయింది. దీంతో తన అద్దె గదిలోని మంచాన్ని మరో మహిళతో పంచుకోవాలని నిర్ణయించుకుంది. దీనివల్ల ఆమెకు నెలకు 450 యువాన్ల (సుమారు 66 డాలర్లు) ఆదా అవుతోంది. "ఇది బతుకుదెరువు కోసం చేస్తున్న పోరాటం. డబ్బు లేనప్పుడు, పని మానేస్తే ఎదురయ్యే ప్రమాదాలను తట్టుకునే శక్తి చాలా బలహీనంగా ఉంటుంది" అని విన్నీ తన పరిస్థితిని వివరించింది.
ఈ 'బెడ్ షేరింగ్' వ్యవహారం సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చకు దారితీసింది. చైనాకు చెందిన వీబో, డౌయిన్ వంటి ప్లాట్ఫామ్లలో దీనికి సంబంధించిన హ్యాష్ట్యాగ్లు లక్షల వ్యూస్ సాధించాయి. జియాహోంగ్షు అనే యాప్లో "బెడ్-షేరింగ్" కోసం వెతికితే వేలకొద్దీ పోస్టులు కనిపిస్తున్నాయి. అపరిచితులతో ఒకే గదిని, కొన్నిసార్లు ఒకే మంచాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నవారి కోసం వెతుకుతున్నట్లు ఈ పోస్టులు వెల్లడిస్తున్నాయి.
ఈ పరిణామంపై రట్జర్స్ యూనివర్సిటీ నిపుణుడు మింగ్వే లియూ మాట్లాడుతూ.. "చాలా మంది యువతలో స్థిరమైన ఉపాధి, స్పష్టమైన ఆదాయ అంచనాలు లేకపోవడం, పట్టణాల్లో తాము నిలదొక్కుకోగలమన్న భరోసా కొరవడటం వంటి వాస్తవ పరిస్థితులకు ఇది ప్రతిబింబం" అని విశ్లేషించారు.
బీజింగ్కు చెందిన 39 ఏళ్ల మోర్గాన్ పాన్ కథ కూడా ఇందుకు భిన్నంగా లేదు. గతంలో ఓ ఏఐ స్టార్టప్లో అధిక జీతం పొందిన ఆయన, ఆ కంపెనీ దివాలా తీయడంతో ఇప్పుడు ఆర్థికంగా చితికిపోయాడు. అద్దె, ఇతర ఖర్చులు తగ్గించుకునేందుకు ఇటీవల తన గదిని, మంచాన్ని మరొకరితో పంచుకోవడం ప్రారంభించాడు. "జీవితంలో ఒత్తిడి తప్ప ఇందులో గొప్పదనం ఏమీ లేదు" అని ఆయన వాపోయాడు.
మరోవైపు విన్నీ జెంగ్, ఖరీదైన బట్టలు కొనడం మానేసి, ఇంట్లోనే వండుకుంటూ పొదుపుగా జీవిస్తోంది. భవిష్యత్తులో జీతం పెరిగినా ఈ విధానాన్ని కొనసాగించవచ్చని ఆమె అంటోంది. "జీతాలు తక్కువ, జీవన వ్యయం ఎక్కువ. అందుకే ఏదో ఒక విషయంలో రాజీపడక తప్పదు. సమాజం ఈ స్థాయికి దిగజారిపోయిందని ఎవరైనా అంటే, అది కఠిన వాస్తవం" అని ఆమె పేర్కొంది.
